రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- October 13, 2025
ఈజిప్ట్ : గాజా కాల్పుల విరమణ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా షర్మ్ ఎల్ షేక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
షర్మ్ ఎల్ షేక్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని, ఖతార్ ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీతో పాటు వెళ్తున్న కాన్వాయ్లో ఒక వాహనం ప్రమాదానికి గురైందని ఈజిప్టుకు చెందిన అల్ కహెరా అల్ ఎఖ్బారియా తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఖతార్ పౌరులు, ఒక ఈజిప్టు డ్రైవర్ ఉన్నాడని తెలిపారు.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌద్ బిన్ థామర్ అల్ థాని సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన ఇద్దరు దౌత్యవేత్తలు షర్మ్ ఎల్ షేక్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరణించిన వారి మృతదేహాలను ఖతార్కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ముగ్గురు దౌత్యవేత్తల మరణం పట్ల ఈజిప్టులోని ఖతార్ రాయబార కార్యాలయం "తీవ్ర విచారం" వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







