ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- October 14, 2025
షర్మ్ ఎల్-షేక్, ఈజిప్ట్ః ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ అమలులోకి రావడంతో గాజా భవిష్యత్తుపై ఉన్నత స్థాయి చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షర్మ్ ఎల్-షేక్ కు వచ్చారు. ఈ కార్యక్రమంలో 20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గాజా శాంతి సదస్సుకు హాజరైన వారిలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఖతారీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగన్, యుకె మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ మరియు సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి సీనియర్ అధికారులు ఉన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంపై అధికారికంగా ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్-సిస్సీ, టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సంతకాలు చేశారు. ఈజిప్టులో జరిగిన సంతకాల చర్చలకు ఇజ్రాయెల్ మరియు హమాస్ ప్రతినిధులు గైర్హాజరు అయ్యారు. అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ కారణంగా గాజాలో రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..







