మీసాల పిల్ల పాట లిరికల్ వీడియో విడుదల
- October 14, 2025
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఒకసారి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తే అప్డేట్తో ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ఒక ప్రత్యేకమైన లిరికల్ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ సాంగ్ రిలీజ్ గురించి తెలియజేశారు. ఈ పాట పేరు ‘మీసాల పిల్ల’, ఇప్పటికే టైటిల్ విన్న వెంటనే అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది.
ఆ పాట వివరాలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాఉ. ఈ పాటను దిగ్గజ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆలపించడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మెలోడీకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
ఉదిత్ నారాయణ్తో పాటు శ్వేతా మోహన్ కూడా ఈ గీతాన్ని ఆలపించారు. గతంలో చిరంజీవి చిత్రాలలోని ఎన్నో సూపర్ హిట్ గీతాలకు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) తన గాత్రాన్ని అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో పాట రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







