గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- February 08, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలవరం నియోజకవర్గం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
దేవరపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. నిన్న ఒక్కరోజే 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా, నేడు మరో ఆరుగురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. వాంతులు, విరోచనాలు మరియు తీవ్రమైన కడుపునొప్పితో విద్యార్థులు విలవిలలాడటం చూసి తోటి విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వరుసగా రెండు రోజులుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండటం పాఠశాల నిర్వహణపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆహారం నాణ్యత విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వరుసగా రెండు రోజులు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీసిన సీఎం, తక్షణమే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గిరిజన పాఠశాలల్లో ఆహార నాణ్యతపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను సూచించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







