అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- October 19, 2025
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. నేడు (ఆదివారం అక్టోబర్ 19) పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్తో హిట్మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు 500వ మ్యాచ్.
ఇక భారత్ తరుపున 500 లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరుపున 500 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు..
- సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్లు
- విరాట్ కోహ్లీ – 551 మ్యాచ్లు
- ఎంఎస్ ధోని – 535 మ్యాచ్లు
- రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్లు
- రోహిత్ శర్మ – 500 మ్యాచ్లు
2007 లో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 67 టెస్టులు, 274 వన్డేలు, 159 టీ20 లు ఆడాడు.టెస్టుల్లో 40.6 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 265 ఇన్నింగ్స్ల్లో 48.8 సగటుతో11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 58 అర్ధశతకాలు ఉన్నాయి. 151 టీ20 ఇన్నింగ్స్లో 4231 పరుగులు సాధించాడు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









