అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- October 19, 2025
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. నేడు (ఆదివారం అక్టోబర్ 19) పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్తో హిట్మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు 500వ మ్యాచ్.
ఇక భారత్ తరుపున 500 లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరుపున 500 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు..
- సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్లు
- విరాట్ కోహ్లీ – 551 మ్యాచ్లు
- ఎంఎస్ ధోని – 535 మ్యాచ్లు
- రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్లు
- రోహిత్ శర్మ – 500 మ్యాచ్లు
2007 లో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 67 టెస్టులు, 274 వన్డేలు, 159 టీ20 లు ఆడాడు.టెస్టుల్లో 40.6 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 265 ఇన్నింగ్స్ల్లో 48.8 సగటుతో11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 58 అర్ధశతకాలు ఉన్నాయి. 151 టీ20 ఇన్నింగ్స్లో 4231 పరుగులు సాధించాడు.
తాజా వార్తలు
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష
- డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
- ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం
- అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- మిస్సోరీలో దిగ్విజయంగా NATS వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!