ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్ - తుర్కియే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవహారాలు, వాణిజ్యం మరియు సంస్కృతితో సహా పలు రంగాల్లో పురోగతి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. నవంబర్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తుర్కియే ను సందర్శించారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు మరియు అవగాహన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు.
తాజాగా టర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక మరియు రక్షణ, సైన్స్ మరియు టెక్నాలజీ, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు మరియు టర్కియే మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం $1 బిలియన్లకు చేరుకుంటుందన్నారు. ఒమన్లో $6 బిలియన్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను టర్కిష్ కంపెనీలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు.
తాజా వార్తలు
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి
- టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!









