ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్ - తుర్కియే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవహారాలు, వాణిజ్యం మరియు సంస్కృతితో సహా పలు రంగాల్లో పురోగతి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. నవంబర్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తుర్కియే ను సందర్శించారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు మరియు అవగాహన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు.
తాజాగా టర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక మరియు రక్షణ, సైన్స్ మరియు టెక్నాలజీ, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు మరియు టర్కియే మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం $1 బిలియన్లకు చేరుకుంటుందన్నారు. ఒమన్లో $6 బిలియన్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను టర్కిష్ కంపెనీలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







