కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- October 21, 2025
కువైట్: కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటన దారులకు KD 5,000 ఫైన్ విధించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదిత సవరణలపై అధికారులు నివేదిక సమర్పించినట్లు కువైట్ మునిసిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని త్వరలో మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం రిఫర్ చేసినట్లు, అక్కడ ఆమోదం పొందగానే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ఉల్లంఘనల తీవ్రతను బట్టి KD 100 నుండి KD 5,000 వరకు జరిమానాలు ఉంటాయని పేర్కొంది. లైసెన్స్ లేకుండా లేదా ఇప్పటికే ఉన్న లైసెన్స్ను పునరుద్ధరించడంలో విఫలమైతే KD 100 నుండి KD 500 వరకు జరిమానా విధించబడుతుంది. వ్యాపారం సమాచార నోటీసును ప్రకటించడం లేదా నిషేధించిన ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తే KD 500 మరియు KD 3,000 మధ్య జరిమానా విధించబడుతుంది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాణిజ్య ప్రకటనలకు అనుమతించే వారికి KD 3,000 మరియు KD 5,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
అలాగే, కొత్త నిబంధనలు బిల్బోర్డ్లు మరియు ఎలక్ట్రానిక్ స్క్రీన్లు వంటి ప్రకటనలకు వర్తిస్తాయని తెలిపారు. బిల్బోర్డ్లు ఐదు మీటర్ల ఎత్తును మించకూడదని, బిల్బోర్డ్ల మధ్య కనీసం 300 మీటర్ల దూరం ఉండాలని నిర్దేశించారు. వాటి లైటింగ్ కూడా అధికంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కొత్త సవరణల్లో నిర్దేశించారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్