ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!

- October 21, 2025 , by Maagulf
ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!

మస్కట్: ఒమన్‌లో పబ్లిక్ కంప్లయింట్స్ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ మేరకు స్టేట్ ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ (SAI) నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే..2024లో ప్రజా ఫిర్యాదులు 45 శాతం పెరిగాయి.  2023లో 951 ఫిర్యాదులు రాగా, 2024లో వాటి సంఖ్య 1,378కి పెరిగింది. ఇందులో ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా 732 కేసులు నమోదయ్యయి.

ఆ తర్వాత  పౌరుల ప్రయోజనాల విఘాతానికి సంబంధించి 460 కేసులు నమోదు అయ్యాయి. 93 ఫిర్యాదులు ఉద్యోగులకు సంబంధించి వచ్చాయి.  అధికార దుర్వినియోగానికి సంబంధించి 37 కేసులు నమోదు కాగా, దాదాపు OMR58 మిలియన్ల ఆర్థిక రికవరీలను సాధించినట్లు నివేదికలో స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com