దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- October 23, 2025
దుబాయ్: దుబాయ్ లో దీపావళి నాడు విషాధం చోటుచేసుకుంది. తన ఇంటి వెలుపల భారతీయ యువకుడు హఠాత్తుగా మరణించాడు. అత్యుత్తమ భారతీయ ప్రవాస విద్యార్థి మరియు ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా గ్రహీత అయిన వైష్ణవ్ మంగళవారం సాయంత్రం తన ఇంటి వెలుపల కన్నుమూశారు. అతని మరణానికి ప్రాథమిక కారణం కార్డియాక్ అరెస్ట్ అని అధికారులు తేల్చారు. అతను మిడిల్సెక్స్ యూనివర్శిటీ దుబాయ్లో మార్కెటింగ్లో BBA మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
18 ఏళ్ల అతను GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థి. వైష్ణవ్ మృతికి పాఠశాల సంతాపం తెలిపింది. “మా మాజీ విద్యార్థి మరియు స్కూల్ కౌన్సిల్ మాజీ హెడ్, వైష్ణవ్ కృష్ణకుమార్ (2024-25 బ్యాచ్) గత రాత్రి హఠాత్తుగా మరణించాడు. ఆయన మృతికి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. అతని తల్లితండ్రులకు (అతని తల్లి విధు కృష్ణకుమార్, మా స్టీమ్ టీచర్) కు ప్రగాఢ సంతాపం.’’ అని తెలిపింది.
తాజా వార్తలు
- ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం
- నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్లు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్లో రోడ్ మూసివేత..!!