దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!

- October 23, 2025 , by Maagulf
దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!

దుబాయ్: దుబాయ్ లో దీపావళి నాడు విషాధం చోటుచేసుకుంది. తన ఇంటి వెలుపల భారతీయ యువకుడు హఠాత్తుగా మరణించాడు. అత్యుత్తమ భారతీయ ప్రవాస విద్యార్థి మరియు ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా గ్రహీత అయిన వైష్ణవ్ మంగళవారం సాయంత్రం తన ఇంటి వెలుపల కన్నుమూశారు. అతని మరణానికి ప్రాథమిక కారణం కార్డియాక్ అరెస్ట్ అని అధికారులు తేల్చారు. అతను మిడిల్‌సెక్స్ యూనివర్శిటీ దుబాయ్‌లో మార్కెటింగ్‌లో BBA మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

18 ఏళ్ల అతను GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థి. వైష్ణవ్ మృతికి పాఠశాల సంతాపం తెలిపింది.  “మా మాజీ విద్యార్థి మరియు స్కూల్ కౌన్సిల్ మాజీ హెడ్, వైష్ణవ్ కృష్ణకుమార్ (2024-25 బ్యాచ్) గత రాత్రి హఠాత్తుగా మరణించాడు. ఆయన మృతికి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. అతని తల్లితండ్రులకు (అతని తల్లి విధు కృష్ణకుమార్, మా స్టీమ్ టీచర్) కు ప్రగాఢ సంతాపం.’’ అని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com