అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- October 23, 2025
దుబాయ్, అక్టోబరు 22: పెట్టుబడులు ఆకర్షించేందుకు దుబాయ్ యూఏఈలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు రెండోరోజు అబుదాబీలో పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు. రేపు ఉదయం 10.15 నిముషాలకు దుబాయ్ నుంచి అబుదాబీ వెళ్లనున్న సీఎం అక్కడ అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో భేటీ కానున్నారు. అబుదాబీలోని అల్ మైరాహ్ ఐలాండ్ లో ఉన్న ఏడీజీఎ స్క్వేర్ లో ఈ సమావేశం జరుగనుంది. జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతోనూ సీఎం సమావేశం అవుతారు. అనంతరం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం అబుదాబీలో స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో సీఎం భేటీ అవుతారు. లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతోనూ ముఖ్యమంత్రి సమావేశమై విశాఖ, విజయవాడలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతోనూ సీఎం భేటీ కానున్నారు.అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో భేటీ అవుతారు. అనంతరం యాస్ ఐ ల్యాండ్ లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. రేపు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







