నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- October 23, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన ఫేక్ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు లొంగిపోతాడని మీడియాలో ముందుగా ఎలా వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఇవాళ తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
“రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ మద్యం మాఫియా ఉంది. ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం తయారుచేస్తున్నారు. బెల్ట్, పర్మిట్ రూమ్స్ తో పాటు వైన్ షాపుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బుల కోసం నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. వాటాల్లో తేడాలు రావడంతో ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది” అని అన్నారు.
నిందితులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. ఆర్గనైజ్డ్గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్కు అలవాటేనని తెలిపారు. ఆఫ్రికాలో మూలలు ఉన్నాయంటూ టీడీపీ సామాజిక మాధ్యమాల్లో బిల్డప్పుల ఇస్తోందని అన్నారు.
నిందితుడితో మాజీ మంత్రి జోగి రమేశ్ పేరును కూడా చెప్పించారని జగన్ ఆరోపించారు. మొలకల చెరువులోనే ఏకంగా 20,000 లీటర్ల నకిలీ మద్యం బయటపడిందని అన్నారు. కల్తీ లిక్కర్ మాఫియాలో టీడీపీ వాళ్లే ఉన్నారని చెప్పారు.
అంతా చేయిస్తున్నది చంద్రబాబేనని అన్నారు. టాపిక్ను డైవర్ట్ చేయడానికి నిందను వేరే వారికి మీద వేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు విజయవాడ సీపీ వింటున్నారని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







