నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- October 23, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన ఫేక్ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు లొంగిపోతాడని మీడియాలో ముందుగా ఎలా వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఇవాళ తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
“రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ మద్యం మాఫియా ఉంది. ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం తయారుచేస్తున్నారు. బెల్ట్, పర్మిట్ రూమ్స్ తో పాటు వైన్ షాపుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బుల కోసం నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. వాటాల్లో తేడాలు రావడంతో ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది” అని అన్నారు.
నిందితులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. ఆర్గనైజ్డ్గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్కు అలవాటేనని తెలిపారు. ఆఫ్రికాలో మూలలు ఉన్నాయంటూ టీడీపీ సామాజిక మాధ్యమాల్లో బిల్డప్పుల ఇస్తోందని అన్నారు.
నిందితుడితో మాజీ మంత్రి జోగి రమేశ్ పేరును కూడా చెప్పించారని జగన్ ఆరోపించారు. మొలకల చెరువులోనే ఏకంగా 20,000 లీటర్ల నకిలీ మద్యం బయటపడిందని అన్నారు. కల్తీ లిక్కర్ మాఫియాలో టీడీపీ వాళ్లే ఉన్నారని చెప్పారు.
అంతా చేయిస్తున్నది చంద్రబాబేనని అన్నారు. టాపిక్ను డైవర్ట్ చేయడానికి నిందను వేరే వారికి మీద వేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు విజయవాడ సీపీ వింటున్నారని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







