ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- October 23, 2025
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్(BRS) పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపధ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) స్వయంగా వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్(BRS) నేతలకు సూచనలు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి ప్రచారం, ఇంటింటి కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
కేసీఆర్ పార్టీ శ్రేణులను సమగ్రంగా సమన్వయం చేసుకుని, విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరే నాయకుల అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









