ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- October 26, 2025
మస్కట్: ఒమన్ లో జాతీయ డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం 36 ప్రాజెక్టులలో 25 డిజిటల్ కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు 100 శాతం పూర్తియినట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ప్రకటించింది. మిగిలిన 11 ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయని, ఇవి 80 శాతం పూర్తి అయినట్లు పేర్కొంది.
ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం, ఇ-ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం మరియు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా సేవలను వేగవంతంగా అందిచడానికి వీలవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
100 శాతం పూర్తయిన ప్రాజెక్టులలో యూనిఫైడ్ ప్రభుత్వ సేవల పోర్టల్ మరియు యూనిఫైడ్ నకల్ (మొబైల్) అప్లికేషన్ ఉన్నాయి. ఇవి బహుళ ప్లాట్ఫారమ్లను నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సేవలకు అనుకూలమైన డిజిటల్ గేట్వేగా పనిచేస్తుందని MTCITలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు సెక్టోరల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ జనరల్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్రెహ్మాన్ అల్ ఖరౌసి తెలిపారు. ఈ కార్యక్రమాల పూర్తి ఒమన్ డిజిటల్ ప్రభుత్వ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తహావుల్ ప్రోగ్రామ్ నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







