ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- October 28, 2025
యూఏఈ: యూఏఈలోని ఓ బ్యాంకులో దొంగతనం జరిగిన గంటల్లోనే నిందితులను ఫుజైరా పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 23న ఉదయం 10.50 గంటలకు ఒక మహిళా బ్యాంకు కస్టమర్ తనను మోసగించి, 195,000 దిర్హామ్లను దోచుకున్నట్లు ఆపరేషన్స్ రూమ్కు ఫిర్యాదు అందింది. ఆమె వాహనం వెనుక టైర్లో సమస్య ఉందని చెప్పి నేరస్థులు ఆమెను తెలివిగా మోసం చేశారు. ఆమె టైర్ ను చూసేందుకు బయటకు రాగా, ముఠా ఆమె వద్ద నున్న డబ్బును దొంగిలించి అక్కడి నుండి జారుకున్నారు.
సమాచారం అందగానే దర్యాప్తు బృందం వెంటనే రంగంలోకి దిగింది. అనుమానితులను గుర్తించి సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కేవలం మూడు గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. బ్యాంకుల నుంచి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులతో మాట్లాడవద్దని అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని ఫుజైరా పోలీసుల ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









