ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- October 28, 2025
యూఏఈ: యూఏఈలోని ఓ బ్యాంకులో దొంగతనం జరిగిన గంటల్లోనే నిందితులను ఫుజైరా పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 23న ఉదయం 10.50 గంటలకు ఒక మహిళా బ్యాంకు కస్టమర్ తనను మోసగించి, 195,000 దిర్హామ్లను దోచుకున్నట్లు ఆపరేషన్స్ రూమ్కు ఫిర్యాదు అందింది. ఆమె వాహనం వెనుక టైర్లో సమస్య ఉందని చెప్పి నేరస్థులు ఆమెను తెలివిగా మోసం చేశారు. ఆమె టైర్ ను చూసేందుకు బయటకు రాగా, ముఠా ఆమె వద్ద నున్న డబ్బును దొంగిలించి అక్కడి నుండి జారుకున్నారు.
సమాచారం అందగానే దర్యాప్తు బృందం వెంటనే రంగంలోకి దిగింది. అనుమానితులను గుర్తించి సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కేవలం మూడు గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. బ్యాంకుల నుంచి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులతో మాట్లాడవద్దని అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని ఫుజైరా పోలీసుల ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







