నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- October 28, 2025
న్యూ ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. శీతాకాలం ప్రారంభమైన ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పొల్యూషన్ స్థాయులు అత్యంత ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో పీఎం 2.5, పీఎం 10 కణాల మోతాదు పెరగడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రధాన చర్యలు ప్రారంభించింది. నవంబర్ 1 నుంచి BS-4, BS-5 డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. నగరంలోమాత్రం BS-6 ప్రమాణాలకు లోబడిన వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది.
ఈ నిర్ణయం ప్రకారం.. వాహనాలపై తనిఖీలు కఠినతరం చేయాలని ఢిల్లీ ట్రాన్స్పోర్టు విభాగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాన ఎంట్రీ పాయింట్లు అయిన గజీాపూర్, ఆనంద్ విహార్, సింగ్ బార్డర్, కపసెరా వంటి ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. పాత వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు సీసీటీవీల సహాయంతో చర్యలు చేపట్టనున్నారు.
ఢిల్లీలో పొల్యూషన్ నియంత్రణ చర్యలలో ఇది కీలక దశగా భావిస్తున్నారు. ప్రతీ సంవత్సరం పంట అవశేషాల దహనం, వాహనాల ఉద్గారాలు, నిర్మాణాదులు కలసి వాతావరణ నాణ్యతను దిగజారుస్తున్నాయి. మున్ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పాత వాహనాల వినియోగాన్ని పూర్తిగా ఆపేందుకు ఢిల్లీ ప్రభుత్వం దీర్ఘకాల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. వాతావరణ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, BS-6 వాహనాల వలన ఉద్గారాలు దాదాపు 40-50 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ వాహనాలు కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







