ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- October 29, 2025
దోహా: ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్ ఇస్తామని ఖతార్ నేషనల్ బ్లడ్ డోనర్ సెంటర్ స్పష్టం చేసింది. అత్యవసర కాల్స్ జారీ అనేది యాదృచ్ఛికం కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆసుపత్రులు రక్త సరఫరా కొరతను ఎదుర్కోకుండా చూసుకోవడానికి రియల్ టైమ్ అవసరాలకు అనుగుణంగా కాల్స్ ఇస్తుంటామని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) డిపార్ట్మెంట్ ఆఫ్ లాబొరేటరీ మెడిసిన్ అండ్ పాథాలజీలో ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అయ్షా అల్ మలికి తెలిపారు.
ఖతార్లో రక్తాన్ని సేకరించి పంపిణీ చేయడానికి బాధ్యత వహించే ఏకైక సంస్థగా, అన్ని ఆసుపత్రులలో కీలకమైన సరఫరా స్థాయిలను నిర్వహిస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా O నెగిటివ్, A నెగిటివ్ మరియు B నెగిటివ్ వంటి బ్లడ్ గ్రూపుల కొరత తరచుగా ఉంటుందన్నారు.
శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు మరియు దీర్ఘకాలిక రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారికి అత్యవసరంగా రక్తం సరఫరా చేయాల్సి ఉంటుందని, అందుకు నిరంతరం రక్తం నిల్వలను నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయని డాక్టర్ అల్మాలికి వివరించారు.
ఆరోగ్యవంతులు ప్రతిఒక్కరూ తరచూ రక్త దానం చేయాలని, ఒకసారి చేసిన రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని, రక్తదానం చేసి జీవితంలో హీరోలుగా మారాలని డాక్టర్ అల్మాలికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







