సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- November 01, 2025
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 మొదటి అర్ధభాగంలో దూసుకుపోయింది. 60.9 మిలియన్ల స్థానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులు సౌదీని సందర్శించారు. ఈ మేరకు సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. ఈ కాలంలో మొత్తం పర్యాటక వ్యయం SR161.4 బిలియన్లను దాటింది.ఇది 2024లో ఇదే కాలంతో పోలిస్తే 4% వృద్ధిని నమోదు చేసింది.
ఇన్బౌండ్ పర్యాటకులకు సగటు స్టే 6.7 రాత్రులు మరియు దేశీయ ప్రయాణికులకు 18.6 రాత్రులుగా ఉందని డేటా తెలిపింది. ఇన్బౌండ్ పర్యాటకంలో మక్కా మరియు మదీనా అగ్ర గమ్యస్థానాలుగా ఉండగా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ దేశీయ పర్యాటకంలో ముందున్నాయి. ఈజిప్ట్, పాకిస్తాన్ మరియు కువైట్ సౌదీకి పర్యాటకులను పంపే మొదటి మూడు దేశాలుగా నిలిచాయి. ఆ తరువాత భారత్ , ఇండోనేషియా ఉన్నాయి.
ఇక స్టే ఎంపికలలో హోటళ్ళు 43% వాటాను కలిగి ఉన్నాయి. ఆ తరువాత ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లు మరియు ప్రైవేట్ నివాసాలు ఉన్నాయని డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









