సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- November 01, 2025
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 మొదటి అర్ధభాగంలో దూసుకుపోయింది. 60.9 మిలియన్ల స్థానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులు సౌదీని సందర్శించారు. ఈ మేరకు సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. ఈ కాలంలో మొత్తం పర్యాటక వ్యయం SR161.4 బిలియన్లను దాటింది.ఇది 2024లో ఇదే కాలంతో పోలిస్తే 4% వృద్ధిని నమోదు చేసింది.
ఇన్బౌండ్ పర్యాటకులకు సగటు స్టే 6.7 రాత్రులు మరియు దేశీయ ప్రయాణికులకు 18.6 రాత్రులుగా ఉందని డేటా తెలిపింది. ఇన్బౌండ్ పర్యాటకంలో మక్కా మరియు మదీనా అగ్ర గమ్యస్థానాలుగా ఉండగా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ దేశీయ పర్యాటకంలో ముందున్నాయి. ఈజిప్ట్, పాకిస్తాన్ మరియు కువైట్ సౌదీకి పర్యాటకులను పంపే మొదటి మూడు దేశాలుగా నిలిచాయి. ఆ తరువాత భారత్ , ఇండోనేషియా ఉన్నాయి.
ఇక స్టే ఎంపికలలో హోటళ్ళు 43% వాటాను కలిగి ఉన్నాయి. ఆ తరువాత ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లు మరియు ప్రైవేట్ నివాసాలు ఉన్నాయని డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







