సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- November 01, 2025
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 మొదటి అర్ధభాగంలో దూసుకుపోయింది. 60.9 మిలియన్ల స్థానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులు సౌదీని సందర్శించారు. ఈ మేరకు సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. ఈ కాలంలో మొత్తం పర్యాటక వ్యయం SR161.4 బిలియన్లను దాటింది.ఇది 2024లో ఇదే కాలంతో పోలిస్తే 4% వృద్ధిని నమోదు చేసింది.
ఇన్బౌండ్ పర్యాటకులకు సగటు స్టే 6.7 రాత్రులు మరియు దేశీయ ప్రయాణికులకు 18.6 రాత్రులుగా ఉందని డేటా తెలిపింది. ఇన్బౌండ్ పర్యాటకంలో మక్కా మరియు మదీనా అగ్ర గమ్యస్థానాలుగా ఉండగా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ దేశీయ పర్యాటకంలో ముందున్నాయి. ఈజిప్ట్, పాకిస్తాన్ మరియు కువైట్ సౌదీకి పర్యాటకులను పంపే మొదటి మూడు దేశాలుగా నిలిచాయి. ఆ తరువాత భారత్ , ఇండోనేషియా ఉన్నాయి.
ఇక స్టే ఎంపికలలో హోటళ్ళు 43% వాటాను కలిగి ఉన్నాయి. ఆ తరువాత ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లు మరియు ప్రైవేట్ నివాసాలు ఉన్నాయని డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







