21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!

- November 01, 2025 , by Maagulf
21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ \'మనామా డైలాగ్ 2025\' ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ వేదికగా 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ “మనామా డైలాగ్ 2025” ప్రారంభమైంది.క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, లెఫ్టినెంట్ జనరల్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రాంతీయ భద్రతా శిఖరాగ్ర సమావేశం “మనమా డైలాగ్ 2025”ను ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, భద్రతా అధికారులు, సైనిక దళాల అధిపతులు, విద్యావేత్తలు హాజరయ్యారు.  

ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతను పెంచేలా మనమా డైలాగ్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.అభివృద్ధికి భద్రత మూలస్తంభమని తెలిపారు. భద్రత మరియు శాంతికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికగా రెండు దశాబ్దాలుగా మనమా డైలాగ్ విజయం సాధించిందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com