దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- November 01, 2025
ముంబై: ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival – DPIFF) 2025 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ సహా పలు భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకలో టాలీవుడ్కి గర్వకారణంగా నిలిచింది ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ (Kalki Movie) చిత్రం. ఇది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ (Film of the Year) అవార్డు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన విజువల్ గ్రాండియర్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, కథా నిర్మాణం, ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఈ అవార్డు ద్వారా తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హర్రర్ కామెడీ జానర్లో సంచలనం సృష్టించిన‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్గా కృతి సనన్, బెస్ట్ డైరెక్టర్గా కబీర్ఖాన్కు అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







