దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- November 01, 2025
ముంబై: ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival – DPIFF) 2025 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ సహా పలు భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకలో టాలీవుడ్కి గర్వకారణంగా నిలిచింది ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ (Kalki Movie) చిత్రం. ఇది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ (Film of the Year) అవార్డు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన విజువల్ గ్రాండియర్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, కథా నిర్మాణం, ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఈ అవార్డు ద్వారా తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హర్రర్ కామెడీ జానర్లో సంచలనం సృష్టించిన‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్గా కృతి సనన్, బెస్ట్ డైరెక్టర్గా కబీర్ఖాన్కు అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







