హైదరాబాద్ లో `లక్ష్మీ బాంబ్` ఫ్రమ్ శివకాశి
- July 23, 2016
గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందుతోన్న కొత్త చిత్రం `లక్ష్మీ బాంబ్`. ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా... దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ''మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె రోల్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది'' అన్నారు. చిత్ర నిర్మాతలు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ మాట్లాడుతూ ''మంచు లక్ష్మీగారిని పవర్ఫుల్గా ప్రెజెంట్ చేసే చిత్రమిది. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మంచు లక్ష్మీగారు చేయని, పవర్ఫుల్ రోల్లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఫైట్ మాస్టర్స్ వెంకట్ నేతృత్వంలో ఓ ఫైట్, రాంబాబు నేతృత్వంలో మరో ఫైట్ను చిత్రీకరించాం. అలాగే డ్యాన్స్ మాస్టర్ కిరణ్ నేతృత్వంలో రెండు సాంగ్స్ను చిత్రీకరించాం. ఆగస్టు నెలాఖరు వరకు జరిగే కంటిన్యూ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







