4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!

- November 05, 2025 , by Maagulf
4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!

యూఏఈ: యూఏఈలోని ముసాందం దక్షిణ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభంవించింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) యొక్క నేషనల్ సీస్మిక్ నెట్‌వర్క్ తెలిపింది. భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్టు తెలిపారు.  యూఏఈ నివాసితులు భూప్రకంపనలను అనుభవించారని, అయితే, మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం పెద్దగా లేదని స్పష్టం చేసింది.  

యూఏఈ పెద్ద భూకంప జోన్‌లో లేనప్పటికీ, అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవిస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉందని నిపుణులు తెలిపారు. ఇరాన్ మరియు ఇరాక్‌ల గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణిలో తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను ఉత్పత్తి చేస్తుందని NCMలోని భూకంప పర్యవేక్షణ విభాగం తాత్కాలిక అధిపతి మొహమ్మద్ అల్హస్సాని వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com