కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!

- November 07, 2025 , by Maagulf
కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!

కువైట్ః కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన రెండు రోజుల అధికారిక కువైట్ పర్యటన ప్రారంభమైంది.  బయాన్ ప్యాలెస్‌లో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేరళ మరియు కువైట్ మధ్య కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. ఇండియా, కువైట్ మధ్య దీర్ఘకాలిక మరియు స్నేహపూర్వక సంబంధాలను సమీక్షించారు.
కువైట్ అభివృద్ధికి ఇండియాన్ కమ్యూనిటీ- ముఖ్యంగా మలయాళీల అమూల్యమైన సహకారాన్ని షేక్ ఫహద్ ప్రశంసించారు. కేరళీయుల పట్ల కువైట్ చూపుతున్న ప్రేమకు ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళను పెట్టుబడికి అనుకూలమైన గమ్యస్థానంగా హైలెట్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయతిలక్, లులు గ్రూప్ చైర్మన్ M.A. యూసుఫ్ అలీ మరియు భారత రాయబార కార్యాలయం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com