ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- November 08, 2025
బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన ఐదో టీ20 అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, వర్షం మాత్రం మ్యాచ్ను పూర్తిగా చెడగొట్టింది. ప్రారంభం నుంచే భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా, ఆ దూకుడును వర్షం నిలిపేసింది. చివరికి మ్యాచ్ రద్దయిందని అంపైర్లు ప్రకటించడంతో, ముందంజలో, 2-1 తేడాతో ఉన్న సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మొదటి ఓవర్ నుంచే దాడి మోడ్లోకి వెళ్లింది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి అద్భుతమైన ఆరంభం అందించారు. కేవలం 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు నమోదు చేసారు..
గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం.. ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దాంతో.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







