ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- November 08, 2025
బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన ఐదో టీ20 అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, వర్షం మాత్రం మ్యాచ్ను పూర్తిగా చెడగొట్టింది. ప్రారంభం నుంచే భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా, ఆ దూకుడును వర్షం నిలిపేసింది. చివరికి మ్యాచ్ రద్దయిందని అంపైర్లు ప్రకటించడంతో, ముందంజలో, 2-1 తేడాతో ఉన్న సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మొదటి ఓవర్ నుంచే దాడి మోడ్లోకి వెళ్లింది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి అద్భుతమైన ఆరంభం అందించారు. కేవలం 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు నమోదు చేసారు..
గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం.. ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దాంతో.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్కు భారీ డిమాండ్..
- వరంగల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







