విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- November 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ఆధార్(Aadhaar) వివరాలను సులభంగా సరిచేసుకునేందుకు పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్డేట్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమం నవంబర్ 17 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థుల ఆధార్ వివరాల్లో ఉన్న పొరపాట్లు సరిచేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని (వేలిముద్రలు, కంటి స్కాన్) నవీకరించడం వంటి సేవలు(UIDAI) అందుబాటులో ఉండనున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లకు అధికారిక సూచనలు పంపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలలోనే ఈ అప్డేట్ సేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని అధికారుల విజ్ఞప్తి. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







