నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- November 15, 2025
హైదరాబాద్: ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి.ఫేక్ ఖాతాలతో ప్రజల్ని మోసగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే ఈమధ్య సైబర్ నేరగాళ్లు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీలు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలను స సృష్టిస్తున్నారు. వారి పేరుతో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఖాతాలతో ప్రజలను మోసగించే మెసేజ్ లను పంపుతున్నారు.
తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు.ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి రూ.20వేలు పంపిమోసపోయారని చెప్పారు.
డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్ లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్ లు, మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







