ఒకే కుటుంబంలో 18 మంది మృతి

- November 17, 2025 , by Maagulf
ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హైదరాబాద్ విద్యానగర్ నల్లకుంటకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నసీరుద్దీన్ (65) కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. నసీరుద్దీన్, ఆయన భార్య ముగ్గురు కుమార్తెలు కుమారులు కోడళ్లు మరియు వారి పిల్లలు మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు.

నసీరుద్దీన్ కుటుంబానికి శోకసమాఖ్యను వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే, ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ ప్రమాదం నేపథ్యంలో, సౌదీకి బీఆర్ఎస్ మైనార్టీ నేతల బృందం వెళ్లనుంది.బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు మాస్టార్ మంత్రులు మహమూద్ ఆలీ మరియు సీనియర్ నేతలతో కలిసి సౌదీకి వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com