మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం

- November 17, 2025 , by Maagulf
మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం

హైదరాబాద్: సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 45 మంది మరణించారు.మృతులందరూ హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై తెలంగాణ మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి అజారుద్దీన్, MIM ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వం ప్రతినిధుల బృందాన్ని సౌదీ అరేబియాకు పంపించనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ మంత్రివర్గం,మృతులకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రయాలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యుల సహాయంగా రెండు వ్యక్తులను అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించింది.మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్ళిపోతున్నప్పుడు ఈ దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుంది, మరియు డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి, అప్పుడు బస్సు పూర్తిగా మంటల్లో కొట్టుకుపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com