మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- November 21, 2025
కువైట్: మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులను అందకుండా ఎదుర్కోవడంలో కువైట్, ఇండియా చేతులు కలిపాయి. అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం గురించి ముఖ్యంగా సమీక్షించారు. ఇండియాలోని కువైట్ రాయబారి మేషల్ అల్-షమాలి, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు భారతదేశ ఆర్థిక యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అధిపతి దివాకర్ నాథ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కువైట్ అమలు చేస్తుందని అల్-షమాలి పేర్కొన్నారు. ఆయా సంస్థలను ఆర్థికంగా అడ్డుకునేందుకు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (KFIU) సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఇండియాతో ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇప్పటికే కుదిరిన ఒప్పందం అమల్లో ఉందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం కువైట్ ఆర్థిక సంస్థలు, భారత ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







