హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- November 26, 2025
హాంకాంగ్లో అతి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది సజీవదహనమయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
హాంకాంగ్ ఉత్తర తై పోలోని అపార్ట్మెంట్ బ్లాక్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటల్లో 28 మంది గాయపడ్డారని అధికారులు అంటున్నారు. మంటల వల్ల భారీ అపార్ట్మెంట్ల చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనేక మంది లోపల చిక్కుకున్నారని అక్కడి మీడియా తెలిపింది.
తై పోలోని వాంగ్ ఫుక్ కోర్ట్లో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయని ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందుకుంది. వాంగ్ ఫుక్ కోర్ట్ ఎనిమిది బ్లాకులతో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్ లో దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్నాయి. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
హ్యారి చెయుంగ్ (66) అనే వ్యక్తి నాలుగు దశాబ్దాలకుపైగా ఆ కాంప్లెక్స్లోని బ్లాక్ 2లో నివసిస్తున్నారు. అతను మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చాలా పెద్ద శబ్దం విన్నానని, తమకు దగ్గరలోని బ్లాక్ లో మంటలు చెలరేగినట్లు చూశానని అన్నారు.
వెంటనే వెళ్లి నా వస్తువులు సర్దుకున్నాను అని చెప్పారు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ రాత్రి ఎక్కడ నిద్రపోతానో అని మాత్రమే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









