హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- November 26, 2025
హాంకాంగ్లో అతి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది సజీవదహనమయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
హాంకాంగ్ ఉత్తర తై పోలోని అపార్ట్మెంట్ బ్లాక్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటల్లో 28 మంది గాయపడ్డారని అధికారులు అంటున్నారు. మంటల వల్ల భారీ అపార్ట్మెంట్ల చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనేక మంది లోపల చిక్కుకున్నారని అక్కడి మీడియా తెలిపింది.
తై పోలోని వాంగ్ ఫుక్ కోర్ట్లో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయని ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందుకుంది. వాంగ్ ఫుక్ కోర్ట్ ఎనిమిది బ్లాకులతో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్ లో దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్నాయి. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
హ్యారి చెయుంగ్ (66) అనే వ్యక్తి నాలుగు దశాబ్దాలకుపైగా ఆ కాంప్లెక్స్లోని బ్లాక్ 2లో నివసిస్తున్నారు. అతను మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చాలా పెద్ద శబ్దం విన్నానని, తమకు దగ్గరలోని బ్లాక్ లో మంటలు చెలరేగినట్లు చూశానని అన్నారు.
వెంటనే వెళ్లి నా వస్తువులు సర్దుకున్నాను అని చెప్పారు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ రాత్రి ఎక్కడ నిద్రపోతానో అని మాత్రమే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







