హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- November 26, 2025
హాంకాంగ్లో అతి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది సజీవదహనమయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
హాంకాంగ్ ఉత్తర తై పోలోని అపార్ట్మెంట్ బ్లాక్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటల్లో 28 మంది గాయపడ్డారని అధికారులు అంటున్నారు. మంటల వల్ల భారీ అపార్ట్మెంట్ల చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనేక మంది లోపల చిక్కుకున్నారని అక్కడి మీడియా తెలిపింది.
తై పోలోని వాంగ్ ఫుక్ కోర్ట్లో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయని ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందుకుంది. వాంగ్ ఫుక్ కోర్ట్ ఎనిమిది బ్లాకులతో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్ లో దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్నాయి. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
హ్యారి చెయుంగ్ (66) అనే వ్యక్తి నాలుగు దశాబ్దాలకుపైగా ఆ కాంప్లెక్స్లోని బ్లాక్ 2లో నివసిస్తున్నారు. అతను మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చాలా పెద్ద శబ్దం విన్నానని, తమకు దగ్గరలోని బ్లాక్ లో మంటలు చెలరేగినట్లు చూశానని అన్నారు.
వెంటనే వెళ్లి నా వస్తువులు సర్దుకున్నాను అని చెప్పారు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ రాత్రి ఎక్కడ నిద్రపోతానో అని మాత్రమే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







