2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!

- November 27, 2025 , by Maagulf
2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!

యూఏఈ: యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలను పురస్కరించుకొని 2,937 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.వారికి యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు.ఖైదీలు వారి శిక్షల్లో భాగంగా ఎదుర్కొన్న ఆర్థిక జరిమానాలను కూడా చెల్లించాలని ఆదేశించారు.

సామాజిక ఐక్యత మరియు పునరావాసం కోసం గల అవకాశాలను ప్రోత్సహించడానికి అధ్యక్షుడు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ క్షమాభిక్ష కూడా ఒక భాగమని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com