ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- December 01, 2025
మస్కట్: బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (PKX) నుండి వచ్చిన చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ మొదటి సర్వీస్ విమానాన్ని ఆదివారం సాయంత్రం ఒమన్ విమానాశ్రయ అధికారులు స్వాగతించారు. ఇది మస్కట్ మరియు బీజింగ్ మధ్య వారానికి రెండు సర్వీసులను నడుపనున్నారు. ఈ కొత్త సర్వీస్, సుల్తానేట్ - చైనా దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచుతుందని భావిస్తున్నారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రతి ఆదివారాలు మరియు బుధవారాల్లో 299 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఎయిర్బస్ A330-300 విమానాలను ఉపయోగించి విమాన సర్వీసులు నడుస్యని తెలిపారు. ఇవి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, వివిధ విభాగాలలోని ప్రయాణికులకు సేవలు అందిస్తాయని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజ్జాన్ బిన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









