హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- December 04, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో HILTP పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు, వివిధ పారిశ్రామిక వాడలను సందర్శించే కార్యక్రమల్లో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని షాపూర్ నగర్ మెయిన్ రోడ్,హమాలి అడ్డా దగ్గర
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే K.P వివేకానంద గౌడ్,
ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,
మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రథోడ్ తో పాటు బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలలో పర్యటించి అక్కడి పరిశ్రమ యజమానులతో అదేవిధంగా అక్కడి కార్మికులతో మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీ గురించి కేటీఆర్ వివరించారు.ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పెద్దయెత్తున పాల్గొన్నారు....
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









