హీరోయిన్ యామిని భాస్కర్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- December 05, 2025
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు.ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు.స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్నెస్తో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది.ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్,సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యామిని భాస్కర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్టు ఎలా వచ్చింది? కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?
-నర్తనశాల తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఏం సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, డైరెక్టర్ వరుణ్ ఫ్రెండ్ మా కమ్యూనిటీ లోనే ఉంటాడు.మేము కలిసి వాకింగ్ చేస్తుంటాము. అప్పుడు ఈ కథ చెప్పాడు. డైవర్స్ తీసుకున్న అమ్మాయి, తనకు ఒక పిల్లాడు కూడా వుంటాడు. ఈ క్యారెక్టర్ చేస్తావా అని అడిగారు.కొత్తగా అనిపించింది.ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు.
-తర్వాత డైరెక్టర్ వరుణ్ ని కలిశాను. ఆయన కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేశాను. పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది.
ఈ సినిమా టీజర్ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత అర్జున్ రెడ్డి తో పోలికలు వచ్చాయి కదా?
-పోస్టర్ లుక్కు అలా ఉంటుందేమో కానీ ఈ కథకు అర్జున్ రెడ్డికి సంబంధం లేదు.అర్జున్ రెడ్డి, సిద్ధార్థ ఈ రెండు క్యారెక్టర్ లో టోటల్ డిఫరెంట్.
ఈ సినిమాలో హీరోతో మీ జర్నీ ఎలా ఉండబోతుంది?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు శ్రావ్య. ఒక హానికరమైన రిలేషన్ నుంచి బయటకు వచ్చి స్వతహాగా బ్రతకాలనుకుంటుంది. ఇదే సమయంలో సిద్ధార్థ కి బ్రేక్ అప్ అయి ఉంటుంది. తను అన్ని వదిలేసి ఒక బస్తీలో ఉండడానికి వస్తాడు. అక్కడ మేము కనెక్ట్ అవుతాము. అప్పుడు ఒక ప్రేమ కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. ఇది ఒక సహజమైన ప్రేమ కథ. అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది.
నందు తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నందు మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు.చాలా జెన్యూన్ పర్శన్. చాలా మంచి మనిషి. నందుతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.
ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మీకు ఎలా అనిపించింది?
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఔట్పుట్ విషయంలో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము.
- సురేష్ బాబు ఈ సినిమాని తీసుకోవడం మా అందరికీ పెద్ద సర్ప్రైజ్.రామానాయుడు స్టూడియోలో మా సినిమా పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఆ పోస్టర్ చూసి నేను డైరెక్టర్ వరుణ్ చాలా ఎమోషనల్ అయ్యాం. ఫోటోలు కూడా తీసుకున్నాం.
-డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమా చూసి నా క్యారెక్టర్ గురించి చాలా ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు. పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశానని చెప్పారు. ఇప్పటినుంచి సినిమాలు మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయమని చెప్పారు.
ఈ సినిమా నిర్మాణం విషయంలో చాలా కష్టపడ్డామని నందు చెప్పారు కదా..నిర్మాతల సపోర్ట్ ఎలా ఉంది?
-సినిమాకి ఏం కావాలో అవన్నీ ఇచ్చారు. నేను కూడా సినిమాని వోన్ చేసుకున్నాను. నేను డైట్ లో ఉండడం కారణంగా ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకునేదాన్ని. కార్వాన్ అంటూ ఏమీ లేదు. లొకేషన్ లోనే కూర్చుని చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏమిటి?
-ట్రైలర్ చూసిన చాలా మంది ఫ్రెండ్స్ మెసేజ్ లు పెట్టారు.మళ్ళీ స్క్రీన్ మీద చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాల్లో కంటిన్యూ చేయమని కోరారు.
-ఈ సినిమా టీజర్ చూసిన రోజే సినిమాల్ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాను. మంచి క్యారెక్టర్ వస్తే ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను.
కాటమరాయుడు సినిమా చేశారు కదా..పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-ఫస్ట్ డే నాకు పవన్ కళ్యాణ్ గారికి ఒక సీన్ ఉండింది. నేను క్లాసికల్ డాన్స్ చేసేదాన్ని. ఆయన ఆ రోజు దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు. నా జర్నీ గురించి అడిగారు. ఆ తర్వాత నేను అజ్ఞాతవాసి సినిమాలో కూడా చేశాను. కానీ అది కట్ అయింది. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఒక స్టార్ గా గొప్ప మనిషిగా ఆయన అంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం.
తాజా వార్తలు
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- భారత్కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!







