సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- December 05, 2025
కువైట్: అల్-ఫర్వానియా గవర్నరేట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు వ్యక్తులతో కూడిన క్రిమినల్ ముఠాను విజయవంతంగా పట్టుకుంది.ఇందులో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, ఇద్దరు అరబ్ జాతీయులు.అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి, రెసిడెన్సీ ఆడ్రస్ లను చట్టవిరుద్ధంగా మార్చడానికి సివిల్ డేటాలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుల ముఠా జలీబ్ అల్-షుయౌఖ్ మరియు ఫర్వానియా ప్రాంతాలలో ఆటోమేటెడ్ భవన సంఖ్యలను ఉపయోగించుకున్నారని, ప్రతి లావాదేవీకి KD 40 మరియు KD 120 మధ్య వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఠా కార్యకలాపాలను ట్రాక్ చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద KD 1,694, ప్రింటర్, హార్డ్ డిస్క్, కెమెరా మరియు డెలివరీ కోసం సిద్ధం చేసిన అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









