సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- December 05, 2025
కువైట్: అల్-ఫర్వానియా గవర్నరేట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు వ్యక్తులతో కూడిన క్రిమినల్ ముఠాను విజయవంతంగా పట్టుకుంది.ఇందులో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, ఇద్దరు అరబ్ జాతీయులు.అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి, రెసిడెన్సీ ఆడ్రస్ లను చట్టవిరుద్ధంగా మార్చడానికి సివిల్ డేటాలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుల ముఠా జలీబ్ అల్-షుయౌఖ్ మరియు ఫర్వానియా ప్రాంతాలలో ఆటోమేటెడ్ భవన సంఖ్యలను ఉపయోగించుకున్నారని, ప్రతి లావాదేవీకి KD 40 మరియు KD 120 మధ్య వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఠా కార్యకలాపాలను ట్రాక్ చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద KD 1,694, ప్రింటర్, హార్డ్ డిస్క్, కెమెరా మరియు డెలివరీ కోసం సిద్ధం చేసిన అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









