సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- December 05, 2025
కువైట్: అల్-ఫర్వానియా గవర్నరేట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు వ్యక్తులతో కూడిన క్రిమినల్ ముఠాను విజయవంతంగా పట్టుకుంది.ఇందులో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, ఇద్దరు అరబ్ జాతీయులు.అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి, రెసిడెన్సీ ఆడ్రస్ లను చట్టవిరుద్ధంగా మార్చడానికి సివిల్ డేటాలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుల ముఠా జలీబ్ అల్-షుయౌఖ్ మరియు ఫర్వానియా ప్రాంతాలలో ఆటోమేటెడ్ భవన సంఖ్యలను ఉపయోగించుకున్నారని, ప్రతి లావాదేవీకి KD 40 మరియు KD 120 మధ్య వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఠా కార్యకలాపాలను ట్రాక్ చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద KD 1,694, ప్రింటర్, హార్డ్ డిస్క్, కెమెరా మరియు డెలివరీ కోసం సిద్ధం చేసిన అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







