ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- December 05, 2025
రియాద్: రియాద్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థాని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. వివిధ కార్యక్రమాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాల మధ్య సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి సాదర స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









