దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- December 14, 2025
దోహా: ఇజ్రాయెల్ దళాలు తూర్పు జెరూసలేంలోని షేక్ జర్రా పరిసర ప్రాంతంలో ఉన్న UNRWA ప్రధాన కార్యాలయంపై దాడి చేయడాన్ని ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఖతార్, జోర్డాన్, యూఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా మరియు ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
పాలస్తీనా శరణార్థుల హక్కులు మరియు సంక్షేమాన్ని పరిరక్షించడంలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (UNRWA) పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు. తన కార్యకలాపాల పరిధిలోని మిలియన్ల మంది పాలస్తీనా శరణార్థులకు రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలు మరియు అత్యవసర సహాయాన్ని అందిస్తోందని గుర్తుచేశారు.
ఇజ్రాయెల్ దళాల దాడి అంతర్జాతీయ చట్టం మరియు UN ప్రాంగణాల ఉల్లంఘనను స్పష్టంగా సూచిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతకు దారితీస్తుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









