సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- December 17, 2025
న్యూ ఢిల్లీ: ఇటీవల సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొన్నది. మహిళలు, పిల్లలు వీటివల్ల ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. తప్పుడు సమాచారం, ఆశ్లీలత, సైబర్ నేరాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా, ఒటిటి ప్లాట్ ఫారమ్ లపై కఠినమైన జవాబుదారీతనాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సురక్షితమైన, నమ్మదగిన, జవాబుదారీ ఇంటర్నెట్ ను ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత కోసం సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐటి చట్టం 200, ఊటీ నియమాలు 2021, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలను పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.
భారతదేశంలో బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన సమాచారం అందించడమే తన విధానాల లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానం ప్రత్యేకంగా మహిళలు, పిల్లలను ఆన్ లైన్ హాని నుండి రక్షించడంపై దృష్టి పెడుతోంది. ఇంటర్నెట్ లో చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ ప్రసారం కాకుండా చూసుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చట్టపరమైన, పరిపాలనాస్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ఐటీ చట్టం 2000, ఐటీ నియమాలు 2021 డిజిటల్ ప్లాట్ ఫామ్ ల బాధ్యతలను నిర్వచిస్తాయి.ఈ చట్టాలు ఆశ్లీల కంటెంట్, గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ నేరాలకు శిక్షను అందిస్తాయి.పోలీసులకు దర్యాప్తు, శోధన, అరెస్టు చేయడానికి కూడా అధికారం ఉంది. ఐటీ నియమాలు 2021 చట్టవిరుద్ధమైన కంటెంట్ నేను బ్లాక్ చేయడం, తొలగించడం కంపెనీలను స్పష్టంగా ఆదేశిస్తుంది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









