రామన్ మెగసెసె అవార్డుకు 2016 గాను ఇద్దరు భారతీయులు ఎంపిక
- July 27, 2016
ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో ఒకరు మానవ హక్కుల కార్యకర్త బెజ్వాడ విల్సన్ కాగా, మరొకరు సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ. ఆసియాలో నిస్వార్థ సేవాపరులను గౌరవించటానికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు.
ఈ ఏటి విజేతల విషయానికి వస్తే.. విల్సన్ కర్ణాటకలోని దళిత కుటుంబంలో జన్మించారు. మానవహక్కుల కోసం పోరాడే ఆయన హుందాగా జీవించడం ప్రతి మనిషికి జన్మతో వచ్చిన హక్కు అని చాటుతారు. చెన్నైకి చెందిన టీఎం కృష్ణ సంగీత విద్వాంసులు. సంస్కృతిలో సామాజికాంశాలను సమ్మిళితం చేయడాన్ని ఆయన ఇష్టపడతారు. వీరితో పాటు ఫిలిప్పీన్స్కి చెందిన కొంచిత కార్పియోమోరల్స్, ఇండోనేషియాకు చెందిన డంపెట్ దౌఫా తమ తమ రంగాల్లో చేస్తున్న సేవలకు, జపాన్, వియత్నాంలకు చెందిన మరో రెండు సంస్థలకు కూడా ఈ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







