ఉల్లంఘనపై పిర్యాదు చేయండి...25 శాతం బహుమానం పొందండి

- July 27, 2016 , by Maagulf
ఉల్లంఘనపై పిర్యాదు చేయండి...25 శాతం  బహుమానం పొందండి

రియాద్: సౌదీకరణలో సమూల మార్పు తెచ్చేందుకు   ఐటి రంగంలో, ఉల్లంఘనెలకు ఎవరైనా పాల్పడితే , దీనిపై  పిర్యాదు చేసి వారికి విధించే జరిమానాలో  25 శాతం బహుమానంగా పొందవచ్చని  కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి ముఫరేజ్  అల్ హఖ్అబానీ  ప్రకటించారు. 
ఐటి రంగంలో  వంద శాతం సౌదీకరణ లక్ష్యంగా  సెప్టెంబర్ ప్రారంభంలో మొదలవుతుంది ప్రతి వ్యక్తి వెంటనే ఐటి ఉల్లంఘనలు మరియు ఇతర రంగాల రిపోర్ట్ అనుమతించే "సామాజిక తనిఖీలను" నిర్వహిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనల మేరకు ఉల్లంఘన ఫీజు విలువలో 25 శాతం బహుమతులు పిర్యాదుదారునికి  కేటాయించాలని 'మంత్రి తెలిపారు.యువ సౌదీలు ఐటి రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని  ఈ సందర్భంగా అల్ హఖ్అబానీ చెప్పారు. అల్ హఖ్అబానీ  విజన్ 2030 అభివృద్ధి లక్ష్యంగా నిరుద్యోగం తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు అలాగే కార్మిక మార్కెట్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com