సిరియాలో ఒకేరోజు రెండు చోట్ల బాంబు పేలుళ్లు

- July 27, 2016 , by Maagulf
సిరియాలో ఒకేరోజు రెండు చోట్ల బాంబు పేలుళ్లు

సిరియాలో ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 44 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. బుధవారం టర్కీ సరిహద్దుల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పర్యవేక్షక బృందం తెలిపిన వివరాల ప్రకారం.. కామిష్లిలోని హసాకా పరిధిలో గల కుర్దిష్‌ పరిపాలన విభాగంలో భద్రతా కార్యాలయ సమీపంలో ఓ కారు బాంబు పేలింది. కొద్ది నిమిషాల తర్వాత నుసేబిన్‌లో ఓ ద్విచక్రవాహనంలో అమర్చిన బాంబు పేలడంతో రెండు చోట్ల కలిపి దాదాపు 44 మంది చనిపోగా మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా.. ఈ పేలుళ్లకు ఐఎస్‌ ఉగ్రవాదులు బాధ్యత వహించినట్లు తెలిపింది. కుర్దిష్‌ వైపీజే సేన, దాని మిత్రపక్షాలైన హుసాకా, అలెప్పోల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com