దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- December 24, 2025
దుబాయ్: తెలుగు భాషకే గర్వకారణమైన శతావధాన సంప్రదాయం దుబాయ్లో మరోసారి వైభవంగా ఆవిష్కృతమైంది. స్థానికంగా గణేష్ రాయపూడి మరియు పద్మజ రాయపూడి నివాసంలో నిర్వహించిన శతావధాన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తమ అసాధారణ పాండిత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.అనంతరం రుక్మిణి కళ్యాణం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా దుబాయ్ మరియు అబుదాబి రాజుల పై అడిగిన ఒక సంక్లిష్టమైన ప్రశ్నకు, బ్రహ్మశ్రీ పద్మాకర్ ఆశుకవిత రూపంలో చక్కని శతావధాన పద్యాన్ని చెప్పి అద్భుత సమాధానాన్ని అందించారు. ఈ తక్షణ కవిత్వం, స్మృతి, లయ, ఛందస్సుల సమన్వయం శతావధాన విశిష్టతను మరోసారి నిరూపించింది.
కార్యక్రమంలో పాల్గొన్నవారు, పద్మాకర్ పాండిత్యం, తెలుగు భాష యొక్క అపూర్వమైన సంపద, శతావధానం అనే అరుదైన సాహిత్య కళ యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలిసిందని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు భాష పరిరక్షణకు, భావి తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
యూఏఈలోని తెలుగు ప్రజలకు ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేసి, తెలుగు భాష గొప్పదనాన్ని, శతావధానం ప్రాముఖ్యతను భావి తరాలకు నేర్పాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







