త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం

- July 27, 2016 , by Maagulf
త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం

త్వరలో కొత్త జనరేషన్‌ ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పలు భద్రత అంశాలను మెరుగుపరిచి, బయోమెట్రిక్‌ వివరాలతో కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తామని ఈరోజు లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్‌ అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. దీంతో నకిలీ పాస్‌పోర్ట్‌లు తగ్గుతాయని అన్నారు. సాధారణంగా పాస్‌పోర్ట్‌లో ప్రింట్‌ చేసి ఉండే సమాచారమంతా ఈ-పాస్‌పోర్ట్‌లో ఎలక్ట్రానిక్‌ చిప్‌లో భద్రపరుస్తామని చెప్పారు. త్వరలోనే పౌరులకు ఈ తరహా పాస్‌పోర్ట్‌లు జారీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com