త్వరలో ఈ-పాస్పోర్ట్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం
- July 27, 2016
త్వరలో కొత్త జనరేషన్ ఈ-పాస్పోర్ట్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పలు భద్రత అంశాలను మెరుగుపరిచి, బయోమెట్రిక్ వివరాలతో కొత్త ఈ-పాస్పోర్ట్లు తీసుకొస్తామని ఈరోజు లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ-పాస్పోర్ట్ అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. దీంతో నకిలీ పాస్పోర్ట్లు తగ్గుతాయని అన్నారు. సాధారణంగా పాస్పోర్ట్లో ప్రింట్ చేసి ఉండే సమాచారమంతా ఈ-పాస్పోర్ట్లో ఎలక్ట్రానిక్ చిప్లో భద్రపరుస్తామని చెప్పారు. త్వరలోనే పౌరులకు ఈ తరహా పాస్పోర్ట్లు జారీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







