కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- December 27, 2025
యూఏఈ: కత్తితో దాడికి పాల్పడ్డ ఆరుగురు ఆసియన్లకు రస్ అల్ ఖైమా మొదటి మిస్డిమీనర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తియిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
మొదటి నిందితుడు కత్తితో బాధితుడి ఇంటిపై దాడి చేసిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడిని మూడుసార్లు కొట్టాడని, దీనివల్ల తీవ్ర గాయాలు ఏర్పడినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. అయితే, ప్రధాన నిందితుడికి బాధితుడికి హాని కలిగించే ఉద్దేశ్యం లేదని కోర్టు గుర్తించినప్పటికీ, దాడి తీవ్రత నేపథ్యంలో శిక్షకు అర్హమైనదని తీర్పు చెప్పింది. రెండు నుండి తొమ్మిది మంది నిందితులు దాడికి సహాయం చేశారని ఆరోపించారు. వారు మొదటి నిందితుడితో పాటు బాధితుడి నివాసానికి వెళ్లారని, దాడి సమయంలో మద్దతు అందించారని, దాడిలో బాధితుడికి శాశ్వత వైకల్యం ఏర్పడిందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







