ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- December 27, 2025
రియాద్: ప్రజారోగ్య పర్యవేక్షణను సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రవాస కార్మికుల వైద్య స్క్రీనింగ్ కేంద్రాలు మరియు ఆహార రంగ కార్మిక క్లినిక్లలో తనిఖీలను ప్రారంభించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం ఈ తనిఖీల లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఆరోగ్య ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.
వైద్య స్క్రీనింగ్ కేంద్రాలలో లైసెన్స్ పొందిన వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా పనిచేయాలని, అవసరమైన స్పెషాలిటీలలో కనీస సిబ్బంది ఉండాలని మంత్రిత్వశాఖ సూచించింది. లైసెన్స్ పొందిన మరియు చెల్లుబాటు అయ్యే వైద్య పరికరాలు మరియు ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలని, అలాగే ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా సెంటర్లు ఏర్పాటు ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఆరోగ్య చట్టాలతో సహా వర్తించే ఆరోగ్య నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో తనిఖీల సందర్భంగా అధికారులు గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. 937 నెంబర్ ద్వారా ఏవైనా ఆరోగ్య ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు









