ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- December 27, 2025
రియాద్: ప్రజారోగ్య పర్యవేక్షణను సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రవాస కార్మికుల వైద్య స్క్రీనింగ్ కేంద్రాలు మరియు ఆహార రంగ కార్మిక క్లినిక్లలో తనిఖీలను ప్రారంభించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం ఈ తనిఖీల లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఆరోగ్య ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.
వైద్య స్క్రీనింగ్ కేంద్రాలలో లైసెన్స్ పొందిన వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా పనిచేయాలని, అవసరమైన స్పెషాలిటీలలో కనీస సిబ్బంది ఉండాలని మంత్రిత్వశాఖ సూచించింది. లైసెన్స్ పొందిన మరియు చెల్లుబాటు అయ్యే వైద్య పరికరాలు మరియు ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలని, అలాగే ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా సెంటర్లు ఏర్పాటు ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఆరోగ్య చట్టాలతో సహా వర్తించే ఆరోగ్య నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో తనిఖీల సందర్భంగా అధికారులు గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. 937 నెంబర్ ద్వారా ఏవైనా ఆరోగ్య ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







