ఇల్లీగల్ ఏజెంట్ల పై కఠిన చర్యలు--కె.టి.ఆర్
- July 27, 2016
వీసా మోసాలకు పాల్పడుతున్న అక్రమ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గ్రామాల్లో ఉన్న అక్రమ ఏజెంట్లను పోలీసుల సహాయంతో ఏరివేస్తామన్నారు. త్వరలో ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’తో సమావేశమై అక్రమ ఏజెంట్లపై చర్యల కోసం నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. తెలంగాణ ఎన్నారై పాలసీ రూపకల్పనలో భాగంగా బుధవారం ఇక్కడ ఎన్నారైలు, ఎన్నారై సంస్థలు, సంఘాలతో మంత్రి సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరించారు.
నైపుణ్యం లేని బ్లూకాలర్ ఎన్నారైల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వివిధ అంశాలపై వచ్చిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని దేశంలోనే ఉత్తమ ఎన్నారై పాలసీని తీసుకొస్తామన్నారు. విదేశాలకు వలస వెళ్లడానికి ముందు ఆయా దేశాల్లో ఆచరించాల్సిన పద్ధతులు, అక్కడి చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. విదేశాలకు వలస వెళ్లినవారి సమగ్ర సమాచారనిధిని రూపొందించడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రవాసి దివస్ను నిర్వహించి విదేశాల్లో రాణిస్తున్న ప్రవాసీయులు, ఉత్తమ కార్మికులు, ఏజెంట్లకు పురస్కారాలు అందిస్తామని చెప్పారు.
ప్రవాసీయుల కోసం ఐటీ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషాల్లో వెబ్ పోర్టల్ను తీసుకొస్తామని, తెలుగు కార్మికుల కోసం గల్ఫ్ దేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, తొలుత దుబాయ్ నుంచి శ్రీకారం చుడతామన్నారు. ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అనుసంధానం చేస్తామని, దీనిపై శనివారం కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్తో ఢిల్లీలో సమావేశం అవుతానన్నారు.
నువ్వెందుకు ఉన్నావు: అధికారిపై మంత్రి ఆగ్రహం
రాష్ట్రంలో వీసా మోసాలకు పాల్పడుతున్న అక్రమ ఏజెంట్ల సమాచారాన్ని ఇతరులు అందజేసినా చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వెందుకు ఉన్నావ్.. ఇంత కాలం ఏం చేస్తున్నావ్.. నువ్వు వలసదారుల రక్షకుడివి కాదా? అక్రమ ఏజెంట్లను అరికట్టడం నీ బాధ్యత కాదా?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అక్రమ ఏజెంట్ల వివరాలను ఏటా ప్రభుత్వానికి అందజేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని పలువురు గుర్తింపు పొందిన ఏజెంట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పాపిరెడ్డి , ఐ.టి డైరెక్టర్ దిలీప్ కొణతం, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్ , శైలేష్ రెడ్డి , పాస్పోర్ట్ అధికారిని అశ్విని, హోమ్ సెక్రటరీ , ఎన్నారైలు జామున పుస్కూర్ , విశ్వేశ్వర్ రెడ్డి , అనిలదీప్ గౌడ్ , భవాని రెడ్డి,భీం రెడ్డి(ప్రవాస మిత్ర ఎడిటర్) ,ఎలిశెట్టి శ్రీనివాస్ (GWTCA),రాజా శ్రీనివాస్(GWTCA--ఈ.టి.సి.ఏ--ప్రెసిడెంట్ ),కిరణ్ కుమార్ పీచర(ఈ.టి.సి.ఏ--ప్రెసిడెంట్),సత్యనారాయణ,వెంకట్ మంతెన(ఏ.టి.ఏ-ప్రెసిడెంట్),చిత్తరువు శ్రీకాంత్(మాగల్ఫ్ డైరెక్టర్), జనగామ శ్రీనివాస్ ,ఎన్.ఆర్.ఐ టి.ఆర్.ఎస్ ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన , చేగొండి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు .



తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









