ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- December 29, 2025
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 24 అంశాలపై చర్చించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపారు. మొత్తం 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని.. తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాల్లో మార్పుల గురించి వివరాలు వెల్లడించారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. మొత్తం 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు తెలిపారు. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
అదేవిధంగా.. సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని, రూ. 41కోట్ల రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్టణంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









