ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- December 29, 2025
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 24 అంశాలపై చర్చించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపారు. మొత్తం 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని.. తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాల్లో మార్పుల గురించి వివరాలు వెల్లడించారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. మొత్తం 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు తెలిపారు. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
అదేవిధంగా.. సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని, రూ. 41కోట్ల రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్టణంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









