'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి వామ్మో వాయ్యో సాంగ్ జనవరి 2న గ్రాండ్ గా లాంచ్
- December 31, 2025
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్ను సృష్టించాయి.
తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి వామ్మో వాయ్యో సాంగ్ జనవరి 2న వరంగల్ లో నిర్వహిస్తున్న గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నారు.
సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ మాస్ ఎనర్జీ అదిరిపోయింది. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ లో మాస్ అండ్ స్టైలిష్గా డాన్స్ చేస్తూ కనిపించిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్ ని సెట్ చేసింది.
సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఫస్ట్ బీట్ నుంచే పండుగ జోష్ను తెరపైకి తీసుకొచ్చింది. రవితేజ తన ట్రేడ్మార్క్ ఎనర్జీ, స్వాగ్తో మెస్మరైజ్ చేశారు. ఆషికా రంగనాథ్, డింపుల్ గ్లామర్తో పాటు గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్తో అలరించారు. మాస్ ఆడియెన్స్ను ఆకట్టుకునే హుక్ స్టెప్స్, గ్రాండ్ విజువల్స్ తో థియేటర్లో అదిరిపోయే వామ్మో వాయ్యో పర్ఫెక్ట్ ఫెస్టివల్ సాంగ్.
ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్.
భర్త మహాశయులకు విజ్ఞప్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ గా ప్రేక్షకుల్ని అలరించబోతుంది.
జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









