పురావస్తు శాస్త్రవేత్త పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి

- July 27, 2016 , by Maagulf
పురావస్తు శాస్త్రవేత్త పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి

పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఎన్నో చరిత్రలను బయటకు తీసి వందలాది శాసనాలను ప్రకటించిన గొప్ప చరిత్రకారునిగా పరబ్రహ్మశాస్త్రి నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. శాతవాహనులు, కాకతీయుల పాలనా విశేషాలు ప్రపంచానికి చాటి చరిత్రకు మేలు చేశారని సీఎం కొనియాడారు. పరబ్రహ్మశాస్త్రి పరమపదించడం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శాత వాహనుల వంశ చరిత్రపై పరిశోధనలు చేసి తెలుగువారని రుజువు చేసిన చరిత్రకారుడు పరబ్రహ్మ శాస్త్రి అని గుర్తు చేశారు. ఆయన మృతి తెలగు భాషకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటని బాలకృష్ణ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com